తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదిన శుభ సందర్భంగా బహరేన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో గుడైబియా ఆండాల్స్ గార్డెన్లో మొక్కను నాటి కేటీఆర్ గారి జన్మదినాన్ని ఘనంగా జరిపినరు.అనంతరం ఎన్నారై టిఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని మరియు రాష్ట్రాన్నిఅన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళుతున్న యువ నాయకుడు కేటీఆర్ గారు అని, బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నారాని. కెసిఆర్ గారి నాయకత్వంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు తెలంగాణకు ఐటి శాఖలు వివిధ కంపెనీ లను రాష్టానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోచించారాని కొనియాడారు..ఈ కార్యక్రమం లో అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, ప్రధాన కార్యదర్శులు పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, సెక్రటరీలు సంగేపుదేవన్న , నరేష్ ఎల్లుల, ఉత్కమ్ కిరణ్ కుమార్ ,సోనా గంగాధర్,సంతోష్,భూమేష్ తదితరులు హాజరయ్యారు.
Post Views: 363