రాశీఖన్నా..ప్రస్తుతం టాలీవుడ్ అగ్రశ్రేణి హీరోయిన్లులో ఒకరు. తన నటనతో మరియు డాన్స్ తో ఫ్యాన్స్ కు పిచ్చేక్కిస్తుంది. అలాంటి హీరోయిన్ ప్రస్తుతం ఏవేవో కొత్త ప్రయత్నాలు చేస్తుందట. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వెంకీమామ చిత్రంలో నటిస్తుంది. ఇందులో నాగచైతన్య సరసన నటించగా, మరో పక్క వెంకీ సరసన పాయల్ రాజ్ పూత్ నటిస్తుంది. అయితే రాశీఖన్నాకు ప్రస్తుతం అవకాశాలే రావడంలేదట. ఎంతో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోల సరసన నటించేందుకు చేయని ప్రయత్నం లేదట. ఈ మేరకు తన శరీరాన్ని సైతం తగ్గించుకొని స్లిమ్ గా తయారయ్యింది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త హీరోయిన్లు హవా ఎక్కువగా నడుస్తుంది. దీంతో రాశీ లాంటి హీరోయిన్లులకు ఇక కష్టమే అని చెప్పాలి. బికినీలో ఫోటో షూట్ చేసినా ప్రస్తుత రోజుల్లో పట్టించుకోరని రాశీఖన్నా గుర్తుపెట్టుకోవాలి.
