Home / ANDHRAPRADESH / జగన్ సీఎంగా సక్సెస్ అవుతున్నారంటూ సన్నిహితుల వద్ద వాపోతున్న చంద్రబాబు

జగన్ సీఎంగా సక్సెస్ అవుతున్నారంటూ సన్నిహితుల వద్ద వాపోతున్న చంద్రబాబు

మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100 రోజులు దాటారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అధికారానికొచ్చాక ఐదేళ్ల కాలంలో పూర్తిచేయాలని అందరు రాజకీయ నాయకులు అనుకొంటారు. అయిపా అన్నీ చేయరు.. ఐదుసార్లు అధికారానికొచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ, చాలాసార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కానీ తామిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేకపోయాయి.. అయితే తన ప్రమాణస్వీకార సభలో జగన్ తాను రాష్ట్రానికి ఏం చేయగలననుకుంటున్నారో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు సెప్టెంబర్ 6వ తారీఖుతో జగన్ పాలనకు వంద రోజులు పూర్తవుతుంది.

ఈ వందరోజుల్లో అవ్వా తాతలకు వృద్ధాప్య పింఛన్‌ ఏకంగా రూ. 2,250కు పెంపు. ఏటా రూ.250 చొప్పున పెంచుతూ రూ.3000 వరకు తీసుకెళ్లాలని నిర్ణయం. పింఛను వయసు 65 నుంచి 60కి తగ్గించి అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం. కిడ్నీ బాధితులకు నెలకు రూ.10 వేల పింఛన్‌, డ్వాక్రా మహిళలకు వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా.. అధికారంలోకి వచ్చేనాటి వరకు ఉన్న రుణాలకు సమానమైన సొమ్మును నాలుగు విడతల్లో అందజేయాలని నిర్ణయం. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి జగనన్న అమ్మ ఒడి ద్వారా ఏటా రూ.15,000. ఇంటర్‌ వరకూ పథకం వర్తింపు. జనవరి 26 నుంచి అమలు.. ప్రతి రైతు కుటుంబానికి వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఏటా (ఈ ఏడాది అక్టోబర్‌ నుంచే) రూ.12,500. విడతల వారీగా రూ.50 వేలు చెల్లించేందుకు నిర్ణయం. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ లేని రుణాలు. ఆక్వా రైతులకు కరెంట్‌ చార్జీలు యూనిట్‌కు రూ.1.50కు తగ్గింపు. ప్రమాదవశాత్తూ చనిపోయిన లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.7 లక్షల పరిహారం. పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.18,000కు పెంపు.

ఆశా వర్కర్ల జీతాలు రూ.10 వేలకు పెంపు. అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు రూ.10,500 నుంచి రూ.11,500కు పెంపు. ఆయాల జీతం రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంపు. గిరిజన తండాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4,000కు పెంపు. హోంగార్డుల వేతనాలు పెంచుతూ నిర్ణయం. గ్రామ, వార్డు సచివాలయాలకు శ్రీకారం. 4 లక్షలకుపైగా ఉద్యోగాలు.. వీటిలో శాశ్వత ప్రాతిపదికన 1లక్షా 27 వేల ఉద్యోగాలు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వలంటీర్‌ నియామకం.. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపుల నిర్వహణ. మద్యం దుకాణాల్లో 16 వేల ఉద్యోగాలు. రూ.100 కోట్లు దాటిన కాంట్రాక్టులన్నింటినీ జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపేలా చట్టం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు. అధునాతన సౌకర్యాలతో 108, 104 అంబులెన్స్‌లు.. కొత్త వాహనాలు కొనుగోలు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం.. 200 పడకలతో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఉత్తర్వులు (రూ. 50 కోట్లు తక్షణ కేటాయింపు) ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు. వంటి దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలనూ జగన్ పరిష్కరించారు. ముఖ్యంగా జీతాల పెంపు, గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ఉద్యోగాల ద్వారా చరిత్ర సృష్టించారు. తాజాగా చంద్రబాబు కూడా వందరోజుల్లోనే ఇలాంటి ప్రజా పధకాలు, జనరంజక పాలనతో ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసుకుంటున్నారంటూ తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat