Home / ANDHRAPRADESH / టీడీపీ, వైసీపీల నిరసన.. కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీల నిరసన.. కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత

రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ, ప్రతిపక్ష తీరును నిరసిస్తూ వైసీపీలు ఆందోళనలకు పిలుపునివ్వటంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.. నగరంలోని పలు కూడళ్ళలో  భారీగా పోలీసులు మోహరించారు.. మాజీమంత్రి కొల్లు రవీంద్ర 36గంటల నిరవధిక నిరసన దీక్ష చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ముఖ్య టీడీపీ నేతలందారినీ హౌస్ అరెస్ట్ చేసారు.తెల్లవారు జామునే ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.కోనేరు సెంటరులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తలపెట్టిన 36గంటల నిరసన దీక్షకు వెళ్ళనీయకుండా ముందుగానే టీడీపీ నేతలను ఒకొక్కరిగా హౌస్ అరెస్ట్ చేసారు. కోనేరుసెంటర్ లో పరిస్థితులను స్వయంగా అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు పరిశీలిస్తున్నారు. అలాగే టీడీపీ తీరును నిరసిస్తూ వైసీపీ కూడా భారీఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. పోలీసులు వైసీపీ నేతలు సైతం అదుపులోకి తీసుకుంటున్నారు. మొత్తంమీద ఇసుక కొరత ఇరు పార్టీల మధ్య మరోసారి వివాదాన్ని రేపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat