ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు,క్యాబ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రా..?. ఇప్పటికే క్రికెట్ రంగంలో ఒక బ్యాట్స్ మెన్ గా.. కెప్టెన్ గా .. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేసుకుంటున్న దాదా తర్వాత స్టెప్ రాజకీయాలేనా..?. అంటే అవును అనే అంటున్నాడు టీమిండియా మాజీ డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్.
నలబై ఒక్క ఏళ్ళ సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో ” బెంగాల్ టైగర్ ..దాదా సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడవుతాడని 2007లో అనుకున్నాను. అది సౌతాఫ్రికాతో కేప్ టౌన్ లో జరిగిన మూడో టెస్ట్ నేను వసీం జాఫర్ త్వరగానే ఔటయ్యాము. నాలుగో నెంబర్ స్థానంలో సచిన్ కు బదులు దాదా బరిలోకి దిగాడు. అది దాదాకు పునరాగమన సిరీస్ . కానీ తీవ్రమైన ఒత్తీడిని సైతం అధిగమించి అద్భుతమైన బ్యాటింగ్ తో అది తనకే సాధ్యమవుతుందని గంగూలీ నిరూపించాడు.
ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్ లో చర్చ జరిగింది. మాలో ఎవరికైన బీసీసీఐ చీఫ్ అయ్యే సత్తా ఉందంటే అది కేవలం ఒక్క సౌరవ్ గంగూలీకే ఉంది అని మేమంతా ముక్తకంఠంతో అంగీకరించాము. అంతే కాకుండా అదే రోజు తర్వాత రోజుల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సైతం దాదా ముఖ్యమంత్రి అవుతాడని ఆ రోజే నేను అన్నాను. నేను కలలు కన్న రెండిటిలో ఒకటి నిజమైంది. రెండోది త్వరలోనే నిజమవుతుందని” సెహ్వాగ్ పోస్టు చేశా