Home / ANDHRAPRADESH / మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు..బాబుగారి రాజకీయం అంతా ఇసుకతోనే ముడిపడి ఉంది

మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు..బాబుగారి రాజకీయం అంతా ఇసుకతోనే ముడిపడి ఉంది

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయంలో గత ఐదేళ్లలో ఎన్ని దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు జరిగాయో అందరికి తెలిసిన విషయమే. బాబు పాలనలో ప్రజల క్షేమం కన్నా తన కుటుంబ బాగుకోసమే ఎక్కువ చూసుకున్నాడు. బాబు అధికారంలో ఉన్నంతకాలం ప్రజలు ఎలాంటి కస్టాలు అనుభవించారో అందరికి తెలిసిందే. అందుకే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పి జగన్ ని అఖండ మెజారిటీతో గెలిపించారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఎప్పుడూ అధికార పార్టీ పై ఒక్క విషయంలో రెచ్చిపోతున్నాడు. అది కూడా ప్రజల బాగుకోసం కాదట..తన సొంత ప్రయోజనాల కోసమేనట. అది ఎలాగా అనేది వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వివరించారు.”మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉందని జానపద కథల్లో విన్నాం. చంద్రబాబు రాజకీయం అంతా ఇసుకతోనే ముడిపడి ఉంది. దాదాపు 9 ఏళ్లు ఇసుక దోపిడీతోనే పార్టీ నాయకులను పోషించాడు. ఇప్పుడు గుప్పెడు ఇసుకను కూడా తాకే పరిస్థితి లేకపోవడంతో ప్రపంచం తలకిందులైనట్టు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు” అని వివరించాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat