తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయక మంత్రి అశ్విన్ కుమార్ చౌబే ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వేదికగా టీబీ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ఇంటర్నేషనల్ యూనియన్ అగైనెస్ట్ ట్యూబర్ కులోసిస్ లంగ్ డిసీజెస్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరగనున్న యాబై వ అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి అశ్విన్ కుమార్ చౌబే మాట్లాడుతూ”ఇన్నోవేటివ్ మెడికల్ సైన్సెస్, బయోమెడికల్ రంగంలో తెలంగాణ ముందంజలో ఉంది.వాయు కాలుష్యం నియంత్రణపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు హర్షణీయమని” అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా టీబీ నివారణకు తెలంగాణ తీసుకుంటున్న చర్యలు భేష్. గత ఆరేళ్ళుగా వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఆదర్శనీయం.కేసీఆర్ కిట్,అమ్మఒడి పథకాలు దేశానికి ఆదర్శనీయమని “ఆయన ఉద్ఘాటించారు.