తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహాన కేసులో పోలీసు అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో పలు అనుమానాలు.. విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని వనస్థలిపురం ఏసీపీ పర్యవేక్షణలో ఏర్పాటైన అధికారుల బృందం ఈ కేసును ఛేదించేందుకు కృషి చేస్తుంది.
ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి అని సమాచారం. ఏసీపీ విచారణలో నిందితుడు సురేష్ ఎమ్మార్వో విజయారెడ్డి హత్యకు ముందు మధ్యవర్తితో రెండు రోజుల ముందే ఆమె ఇంటికెళ్ళి విజయారెడ్డి భర్తను కలిశారని సమాచారం. వారు ఎందుకు కలిశారు.
ఏమి మాట్లాడారు..? అనే పలు అంశాలపై పోలీసులు సుభాష్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తూ పలు కీలక సమాచారం రాబడుతున్నట్లు సమాచారం. అయితే విజయారెడ్డి ఇంటికెళ్లే ముందు సురేష్ తన స్నేహితులకు కాల్ చేసి తాడో పేడో తేల్చుకుంటా అని తేల్చి చెప్పినట్లు కూడా సమాచారం. చూడాలి మరి విచారణలో ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయో..?