ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉప అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ మరియు చంద్రబాబుని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు ఎన్ని తపస్సులు చేసిన టీడీపీ తో కలిసే సమస్యే లేదని తేల్చి చెప్పారు. బాబు తన పార్టీ తరుపు నుండి నేతలని పంపించి మీడియాకు లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వారిని ఎవరూ పట్టించుకోరని. టీడీపీ లో చివరికి చంద్రబాబు మరియు లోకేష్ మాత్రమే ఉంటారని అన్నారు.మా దృష్టిలో టీడీపీ, చంద్రబాబు అంటరాని వాళ్లు, మాకు చేసిన ద్రోహం ఎప్పటికీ మరచిపోమని అన్నారు. ఏపీలో టీడీపీ కధ ముగిసిపోయిందని అన్నారు. చంద్రబాబు, లోకేష్ తప్ప తమ పార్టీలోకి ఎవరూ వచ్చిన ఆహ్వానిస్తామని ఆయన క్లారిటీ ఇచ్చాడు.
