తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ కు సంబంధించి ఆయన అనుచరులు ఓ వార్తను సన్నిహితులతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కాస్త ఆసక్తిని రేపుతోంది. టీడీపీని వీడి వైసీపీ లో చేరడానికి వెళ్లే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన అవినాష్ థాంక్యూ సీఎం గారు అని చెప్పారట. వెంటనే అవినాష్ జగన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఉంటే ఎమ్మెల్యే అయిపోయేవాడివి కదా అంటూ సరదాగా అన్నారట.
