నిర్భయ హత్యాచారం కేసులో నిందితులైన నలుగురు దోషులకు ఈ నెలలో ఉరి తీయనున్న సంగతి విదితమే. సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే 2012లో నిర్భయపై హత్యాచారానికి పాల్పడిన దోషులు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ,అక్షయ్ కుమార్సింగ్ లకు తీహార్ జైలులో ఉరి తీయనున్నారు.
అయితే 1950వ సంవత్సరంలో నిర్మించిన రెండు కాంక్రీట్ పిల్లర్లకు మెటల్ క్రాస్ బార్ ఏర్పాటు చేసి ఉంది. అయితే ఇది నలుగురు దోషుల బరువును ఆపుతుందా లేదా అనే పలు అంశాలపై సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు.
దోషులను ఉరితీయడానికి ఉపయోగించే తాళ్లకు వెన్న పూయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దోషులకు నొప్పి తెలియకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.