తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంహా నిర్మించిన ఐటీ టవర్ ను ఈ నెల ముప్పై తారీఖున ఐటీ,పరిశ్ర్తమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
ఐటీ టవర్ నిర్మాణపనులను పరిశీలించిన మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ” ఐటీ టవర్ లో స్థానికులకే ఉపాధి అవకాశాలను కల్పిస్తామని “అన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతోనే కరీంనగర్ కు ఐటీ టవర్ ను మంజూరు చేశారు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.