చంద్రబాబు అమరావతి రాజధాని యదావిదిగా ఉండాలంటూ ఆందోళనలు చేస్తుంటే మరోవైపు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు విశాఖపట్నం కార్యనిర్వాహఖ రాజధాని కి మద్దతు ఇస్తూ తీర్మానం చేశారు. విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు,నేతలు సమావేశం జరిపి విశాఖలో రాజధాని కి స్వాగతం తెలిపారు. గంటా శ్రీనివాసరావు, గణేష్ కుమార్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు లతో పాటు ఎంపీగా పోటీచేసి ఓడిన భరత్ తదితరులు ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. భరత్ ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు చిన్నల్లుడు కాగా మరో అల్లుడు అయిన లోకేష్ మంగళగిరిలో విశాఖకు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ కాగడాల ప్రదర్శన చేశారు. చంద్రబాబు నాయుడు ఆయా వర్గాల వారిని సమీకరించి అమరావతికి మద్దతుగా మాట్లాడిస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుళ్ళు ఒకరు రాజధానిని స్వాగతిస్తుంటే మరోకరు వ్యతిరేఖిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
