తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు స్వయంగా కారు నడిపారు. ఈ సంఘటన మంగళవారం వరంగల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.వరంగల్ జిల్లాలో మడికొండలో ఐటీ కంపెనీల క్యాంపస్ ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్వయంగా సైయెంట్ చైర్మన్ బీవీఆర్ మోహాన్ రెడ్డి,టెక్ మహేంద్రా సీఈఓ సీపీ గుర్నానీ,ప్రతినిధి ఆశోక్ రెడ్డి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని తన కారులో ఎక్కించుకుని వరంగల్ నుండి మడికొండకు డ్రైవింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
అక్కడ ఐటీ కంపెనీ క్యాంపసులను ప్రారంభించిన అనంతరం కూడా మంత్రి కేటీఆర్ హన్మకొండలోని బాలసముద్రంలో నివాసముంటున్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఇంటికి కూడా స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చాడు. అక్కడ భోజనం చేశాక నిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి హైదరాబాద్ కు బయలుదేరారు.