స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా హిట్ అవ్వడంతో ప్రతీఒక్కరు బన్నీకి విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్భాగానే జూనియర్ ఎన్టీఆర్ బన్నీ కి సినిమా చాలా బాగుందని ట్వీట్ చేయగా అల్లు అర్జున్ దానికి బావా చాలా థాంక్స్ అని రిప్లై ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈరోజుల్లో హీరోలు అందరు కలిసిపోవడం విషెస్ చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Bavaaaaaaaa ! Thank you very mucccchhhh . It’s was soo good talking to you … seee you soon ! https://t.co/qgp3b67jiz
— Allu Arjun (@alluarjun) January 12, 2020