ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం అమరావతి ప్రాంత రైతులకు శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా అమరావతి ప్రాంత రైతులకు మెరుగైన ఫ్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
రాజధాని ప్రాంతం కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు ఇచ్చే కౌలు డబ్బులను పది నుండి పదిహేను ఏళ్లకు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ రోజు సమావేశమైన కేబినెట్ సమావేశంలో రాజధాని ప్రాంత రైతులకు ఎలా న్యాయం చేకూర్చాలనే అంశంపై తీవ్రంగా చర్చించింది. అంతేకాకుండా మరోవైపు ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణను లోకాయుక్తకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.