అమ్మకు అన్నంపెట్టని కొడుకు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తనన్న డట, అలాగున్నది బీజేపీ పద్దతి. రాష్ట్రానికి చిల్లిగవ్వ ఇవ్వని బీజేపీ, మున్సిపాల్టీ లను బాగు చేస్తా దా? ఢిల్లీ నుంచి వచ్చి మన గల్లీల లను వూ డు స్తదా? దీన్ని ఎవరైనా నమ్ముతారా?! అని అన్నారు శాసన మండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. సోమవారం ఆయన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ వి అర్థం లేని మాటలు అన్నారు. నమ్మశక్యం కాని మాటలతో ప్రజలని మభ్య పెట్టాలని చూడటం అవివేకం అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మాటలు మరింత అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. తను తినడానికి తిండి లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె కావాలని వెనుకటికి ఎవరో అన్నట్లు, అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో పవర్ లేదు కానీ, అభివృద్ధి చేస్తామని, ఓ మ్యానిఫెస్టో ని కూడా విడుదల చేసింది. ఏ విధంగా అభివృద్ధి చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇలాంటి పార్టీ ల కల్ల బొల్లి మాటలు నమ్మే స్థితిలో ప్రజలున్నరని భ్రమ పడటం సిగ్గు చేటు అన్నారు. మన రాష్ట్ర పార్టీ, మన ఇంటి పార్టీ, మన ఆత్మగౌరవానికి ప్రతీకైన టీ ఆర్ ఎస్ నే గెలిపించాలని ప్రజలకు పోచంపల్లి పిలుపు నిచ్చారు. సీఎం కెసిఆర్, మంత్రి కెటీఆర్ ల నేతృత్వంలో, మంత్రి దయాకర రావు, ఎమ్మెల్యే అరూ రి రమేష్ గార్ల ఆధ్వర్యంలో అద్భుత అభివృద్ధి జరగాలంటే, కారు గుర్తు కే ఓటు వేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మాజీ ఎంపి సీతారాం నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీ ఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు, అభ్యర్థులు, ప్రజలు పాల్గొన్నారు.