తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ ప్రకటనతో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో అన్ని హాస్టల్స్ మూసివేస్తున్నారు.
దీంతో హాస్టళ్లల్లో ఉండే యువతీ,యువకులు,ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ సాక్షిగా స్పందించారు.దీనిపై మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరంలో హాస్టల్స్ లో ఉండేవాళ్లు ఎవరు భయపడాల్సినవసరంలేదు.హాస్టల్స్ నిర్వాహకులు భయపడిపోయి ఎవర్ని ఖాళీ చేయించవద్దు అని కోరుతున్నానని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
మహానగరంలో హాస్టల్స్ లో ఉండేవాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని..అన్ని సౌకర్యాలను కల్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులను,హైదరాబాద్ సీపీలను కోరినట్లు మంత్రి వివరించారు.