ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినా కొందరు పదేపదే వాహనాలతో రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ఇలాంటివారిని గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం అత్యవసర సేవల విభాగాల వాహనాలకే నగరంలో సంచరించేందుకు అనుమతులున్నాయి.
మిగిలినవారెవరైనా నిత్యావసరాలకు ద్విచక్ర వాహనాలు, కార్లపై తమ నివాసం నుంచి 3 కి.మీ.లోపే ప్రయాణం చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి.. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ ఉన్నతాధికారులు ప్రకటించారు.
మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువదూరం తిరిగిన వాహనదారులను గుర్తించేందుకు ట్రాఫిక్ కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పోలీసులు ఉపయోగించుకుంటున్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా విశ్లేషించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదుచేస్తు.వారి బండ్లను సీజ్ చేయనున్నారు.