కరోనా కట్టడికి వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ప్రఖ్యాత వైరాలజిస్ట్ ఇయాన్ లిప్కిన్ అన్నారు.
అప్పటివరకూ సామాజిక దూరం పాటిస్తూ మహమ్మారికి ముప్పును తప్పించుకోవాలని సూచించారు. ప్లాస్మా థెరఫీ ఎంతవరకూ ఉపయోగపడుతుందనేది మరికొద్ది రోజుల్లో వెల్లడికానుందని అన్నారు.
కోవిడ్-19 గబ్బిలాల నుంచి మానవుడికి వ్యాపించిందని, దీన్ని ఎవరూ లేబొరేటరీల్లో సృష్టించలేదని ఓ వార్తా ఛానెల్తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. కరోనా వైరస్ అత్యంత భయానకపమైనదేమీ కాదని లిప్కిన్ వ్యాఖ్యానించడం గమనార్హం.