ఏపీలో కరోనా కేసులు రోజురోజుకుపెరుగుతుండగా.. మాజీ మంత్రి, బీజేపీ నేత పి.మాణిక్యాలరావు (60) ఈ మహమ్మారి కారణంగా చనిపోయారు.
గత నెల రోజులుగా మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాకు గురై విజయవాడలోని ఓ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఆయన.. కాసేపటిక్రితం ప్రాణాలు కోల్పోయారు.
గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2014లో తాడేపల్లిగూడె నుండి గెలుపొందారు.