చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఆ జట్టు యాజమాన్యం శుభవార్తను అందించింది. ఇటీవల కరోనా వైరస్ బారినపడ్డ 13 మంది కోలుకున్నారని తెలిపింది.
తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వారందరికీ కరోనా నెగిటివ్గా వచ్చిందని సీఎస్కే సీఈఓ కేఎస్ విశ్వనాథన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
కాగా చెన్నై జట్టులోని ఇద్దరు ప్రధాన ఆటగాళ్లతో పాటు మరో 11 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే.
దీంతో జట్టు యాజమాన్యంతో పాటు ఐపీఎల్ నిర్వహకులు తీవ్ర ఆందోళన చెందారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న సీఎస్కే తొలి మ్యాచ్ ఆడనుంది.