తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల పక్షపాతిగా వ్యవహరిస్తోందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం వెంగళరావునగర్ డివిజన్లోని రహ్మత్నగర్లో ఆయన పర్యటించారు.
పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 58, 59 జీవోల గురించి ఇంటింటికీ తిరిగుతూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అవగాహన కల్పించారు. జీవోల పై వారు అడిగే సందేహాలను నివృత్తి చేశారు. 125 గజాల వరకు స్థలం లేదా ఇండ్లు ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరిస్తుందని పేర్కొన్నారు. పేదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చివరిసారిగా ఈ అవకాశం కల్పించిందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అదేవిధంగా నిరుపేదల కోసం డబుల్బెడ్రూం ఇండ్లు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పేద పిల్లలకు సన్న బియ్యం, ఆశ్రయ పాఠశాలలు, అశ, అంగన్వాడీ వర్కర్లకు జీతాల పెంపు వంటి అంశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని రుజువు చేస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షురాలు దేదీప్యరావు, ప్రధాన కార్యదర్శి వేణు, జీటీఎస్ ఆలయ చైర్మన్ బోడ రాంచందర్, మాజీ కార్పొరేటర్ శ్యామ్రావు, వేణుగోపాల్యాదవ్, నరసింహ, విజయ్ముదిరాజ్, అజ్జుసింగ్, రాములుముదిరాజ్, బాలు రజక తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నాం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహ్మత్నగర్ డివిజన్లోని కార్మికనగర్లో రూ.46లక్షల వ్యయంతో వేసిన వీడీసీసీ రోడ్డును ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రహ్మత్నగర్లో రూ.3కోట్లతో ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు నాగరాజు, సీనియర్ నాయకులు సీఎన్ రెడ్డి, షరీఫ్, లియాఖత్ అలీ, అరుణ్, ఇక్బాల్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని కార్మికనగర్, బ్రహ్మశంకర్నగర్ బస్తీల్లో శిథిలమైన అంతర్గత రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు వేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశించారు. దీంతో శుక్రవారం జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు రోడ్లను పరిశీలించారు. వివరాలను సేకరించడంతో పాటు అంచనాలు రూపొందిస్తారని స్థానిక టీఆర్ఎస్ నాయకుడు సీఎన్ రెడ్డి తెలిపారు.