Home / SLIDER / బీజేపీ అభ్యర్థి గా రఘునందన్ రావు

బీజేపీ అభ్యర్థి గా రఘునందన్ రావు

త్వరలోనే జరగనున్న దుబ్బాక ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా బీజేపీ జాతీయ నాయకత్వం రఘునందన్‌రావును ఖరారు చేసింది. మధ్యప్రదేశ్‌లోని 27 స్థానాల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అక్కడి అభ్యర్థులతో పాటు దుబ్బాక అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించింది.

దుబ్బాకలో ఉపఎన్నికల అనివార్యం అని తెలిసినప్పటి నుంచి రఘునందన్ రావు పేరు బీజేపీ వర్గాల్లో ప్రముఖంగా వినిపించింది. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సోలిపేట రామలింగారెడ్డి మృతి తర్వాత రఘునందన్ రావు దుబ్బాకలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. రఘునందన్ రావు అయితేనే గెలుపు ఖాయంగా ఉంటుందని బీజేపీ జాతీయ నాయకత్వం భావించింది.

బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా రఘునందన్ రావు పేరునే సూచించింది. దీంతో అధికారికంగా రఘునందన్ రావు పేరును ప్రకటించారు. ఈ నెల 14న రఘునందన్ రావు నామినేషన్ వేయబోతున్నట్లు తెలిసింది. అటు కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్తిగా రామలింగారెడ్డి భార్య సుజాత ఇప్పటికే ఖరారు అయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat