ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ల జాబితాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది కత్రినాకైఫ్. ఈ భామ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అక్షయ్ కుమార్ తో కలిసి సూర్యవంశీ చిత్రంలో నటిస్తోంది.
మరోవైపు సిద్దాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హార్రర్ కామెడీ మూవీ ఫోన్ భూత్ లో నటిస్తోంది. దీంతోపాటు అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సినిమాలతో తీరిక లేకుండా గడిపే ఈ భామ తాజాగా పర్సనల్ ట్రిప్ కోసం యూకే వెళ్లింది.
ఆదివారం రాత్రి కత్రినా ఓ ప్రైవేట్ జెట్ లో లండన్ కు వెళ్లినట్టు బీటౌన్ మీడియా పేర్కొంది. లాక్ డౌన్ ప్రభావంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో 7 నెలలుగా లండన్ కు వెళ్లలేకపోయింది కత్రినా.
ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో లండన్ లో ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్లింది. మొత్తానికి కత్రినాకు ఇన్నాళ్లకు కుటుంబంతో కలిసి సరదాగా గడిపే సమయం దొరికిందన్నమాట.