శ్రీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘మరణమృదంగం’లో కథానాయికగా శృతి సోదీని ఎంపిక చేసినట్టు చిత్రనిర్మాత కుంచపు రమేశ్ తెలిపారు.
తెలుగు తెరకు ‘పటాస్’తో కథానాయికగా పరిచయమైన ఆమె… తర్వాత ‘సుప్రీమ్’లో ప్రత్యేక గీతంలో సందడి చేశారు. మరో రెండు చిత్రాల్లో కథానాయికగా చేశారు. కొంత విరామం తర్వాత మళ్లీ తెలుగులో చిత్రం చేస్తున్నారు.
వెంకటేశ్ రెబ్బా దర్శకత్వం వహిస్తున్న ‘మరణమృదంగం’ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. నవంబర్లో చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రతీకారం తీర్చుకునే యాక్షన్ పాత్రలో శ్రీకాంత్ కనిపిస్తారు.
ఇది ఆయనకు నప్పే మంచి కథ. ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్టు దర్శకుడు సినిమా తీస్తున్నారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: డి. తులసీదాస్, సంగీతం: ‘మంత్ర’ ఆనంద్, సహ నిర్మాతలు: మధు రెబ్బా, కుంచపు అరుణ.