131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి గారు మరియు స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేఎం గౌరీష్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలందరూ సమన్వయమై ఇంటింటికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని, గత ప్రభుత్వాలు ఏనాడు పట్టించుకోని అభివృద్ధి, సంక్షేమాన్ని అతి స్వల్ప కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.
వచ్చే నెల డిసెంబర్ 1వ తేదీన జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన కుత్బుల్లాపూర్ డివిజన్ అభ్యర్థి కూన గౌరీష్ పారిజాత గారిని కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, టీఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, నర్సింహా రెడ్డి, సత్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు