ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఆరోన్ ఫించ్ లేకపోవడంతో ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
తొలి టీ20 ఆడిన మనీష్ పాండే, మహ్మద్ షమి, రవీంద్ర జడేజా ఈ మ్యాచ్లో ఆడటం లేదు. అటు ఆసీస్ టీమ్లో తొలి టీ20 ఆడిన ఫించ్, స్టార్క్ ఈ మ్యాచ్కు దూరమయ్యారు.
టాప్ ఫామ్లో ఉన్న హేజిల్వుడ్ కూడా ఈ మ్యాచ్లో ఆడటం లేదు. ఈ ముగ్గురి స్థానంలో స్టాయినిస్, సామ్స్, ఆండ్రూ టై టీమ్లోకి వచ్చారు