వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. శ్రీవారికి మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ మొక్కులు సమర్పించుకున్నారు.
అనంతరం ఆలయ పండితులు వారికి ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని నరేందర్, సుంకే రవిశంకర్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు తదితరులు ఉన్నారు.