కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. ఒకవైపు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా విజృంభణ తగ్గుతుంది. కానీ మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రమంగా పుంజుకుంటుంది.
మొన్న బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా పాజీటీవ్ అనే వార్తను మరిచిపోకముందే తాజాగా మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు కరోనా పాజిటీవ్ అని తేలింది.
ఈ విషయాన్ని హీరో రామ్ చరణ్ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.తాను పరీక్షలు చేసుకుంటే కరోనా పాజిటీవ్ అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కోలుకుని త్వరలోనే మీ ముందుకు వస్తాను. నన్ను కల్సిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలి అని సూచించారు.
Post Views: 331