‘ఉప్పెన’లో బేబమ్మగా కృతిశెట్టి కుర్రకారు హృదయాలను దోచేసింది. అయితే ఈ సినిమాలో తొలుత మనీషా అనే అమ్మాయిని యూనిట్ ఓకే చేయగా, సినిమా ప్రారంభమైంది.
దర్శకుడు బుచ్చిబాబు అదే సమయంలో కృతిశెట్టి ఫొటోలను చూశాడు. దీంతో సందిగ్ధంలో పడిన అతడు.. గురువు సుకుమార్కు చెప్పాడు. ‘నీ కన్నా సినిమా గొప్పది. నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. నీకు ఎవరు నచ్చితే వాళ్లనే తీసుకో’ అనడంతో కృతికి ‘ఉప్పెన ఛాన్స్ వచ్చింది.