తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన బక్కపలచు భామ. అందాలను ఆరబోసే హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా నటించిన చిత్రం చెక్. ఈ హాట్ భామ నటించిన చిత్రాలన్నీ ఒక మోస్తారు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ముద్దుగుమ్మ కెరీర్ చాలా డల్ గానే ఉందని చెప్పాలి. చెక్ మూవీ విడుదల సందర్భంగా రకుల్ ప్రీత్ ఒక ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇంటర్వూ ఇచ్చింది. ఈ ఇంటర్వూలో ఈ అందాల రాక్షసి మాట్లాడుతూ హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ ”చెక్ ఏ తరహా చిత్రమనేది నేను ఆలోచించలేదు. నాకు స్ర్కిప్ట్ నచ్చింది.
మేం ఓ ప్రయత్నం చేశాం. నేనెప్పుడూ ఆలోచించేది ఒక్కటే. నాతోనే నాకు పోటీ. అంటే నా లాస్ట్ సినిమాకి, ప్రజెంట్ సినిమాకి కంపేర్ చేస్తే.. నా పర్ఫార్మెన్స్ మెరుగవ్వాలి. నేనెప్పుడూ ఆలోచించేది అదే. అది చెక్లో చాలా ఇంప్రూల్ అయింది. ఈ సినిమా తర్వాత తెలుగులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా చేశా. అందులో వైష్ణవ్ తేజ్ హీరో. మేమిద్దం గ్రామీణ యువతీయువకుల పాత్రల్లో నటించాం. డిఫరెంట్ రోల్ కాబట్టి ఎగ్జైట్ అయ్యా. ప్రస్తుతం హిందీలో నాలుగైదు సినిమాలు చేస్తున్నా. అందులో నాలుగు కమర్షియల్ సినిమాలే.
ఇంకొకటి డిఫరెంట్ సినిమా. ఏ సినిమాలను అయితే ఐదేళ్ల క్రితం కమర్షియల్ కాదని అన్నారో… ఇప్పుడు అవే కమర్షియల్ సినిమాలు అయ్యాయి. ఐదేళ్ల క్రితం ఒక సెక్షన్/సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ కోసం తీసే సినిమాలు అని వేటిని అనుకున్నావో… ఇప్పుడు ఆ సినిమాలను అందరూ చూస్తున్నారు. ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాలు, ఓటీటీల్లో మంచి కంటెంట్ చూస్తున్నారు. అందువల్ల, ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలు ప్రయత్నిస్తూ ఉండాలి. మళ్లీ సేమ్ సినిమాలు రిపీట్ చేస్తే… ఆడియన్స్కి బోర్ కొడుతుంది..” అని తెలిపింది.