Home / MOVIES / వివేక్ కోటి మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : ఎంపీ జోగినపల్లి

వివేక్ కోటి మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : ఎంపీ జోగినపల్లి

ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, తమిళ హాస్యనటుడు వివేక్ హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. గ్రీన్ కలామ్ ప్రాజెక్టు ద్వారా కోటి మొక్కలు నాటాలనుకున్న వివేక్.. ఆ సంకల్పంలో భాగంగా 32 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారని గుర్తు చేసుకున్నారు.

ప్రకృతి పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల వివేక్ నిబద్ధత గొప్పదని, ఆయన కోటి మొక్కల కల నెరవేరకుండానే మరణించడం విచారకరమన్నారు. వివేక్ లక్ష్యం అర్ధంతరంగా ఆగిపోకుండా మిగతా 78 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించి, పూర్తి చేస్తామని జోగినపల్లి ప్రకటించారు. ప్రకృతి ప్రేమికుడు వివేక్ లక్ష్య సాధనే ఆయనకు అసలైన నివాళి అని ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat