తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో స్థితిగతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్కమిటీని నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది.
ఈ సబ్కమిటీకి ఆర్థికమంత్రి హరీశ్రావు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, పీ సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు.
ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు, పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెళ్లి అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందించాలని మంత్రిమండలి సూచించింది.