తెలంగాణ రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆపద్భాందవుడిలా ఆదుకుంటూ.. ఎంతో మందికి అండగా నిలుస్తున్న కేటీఆర్.. ఇప్పుడు వికలాంగులకు అండగా నిలవబోతున్నారు.
తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా.. వంద మంది వికలాంగులకు మూడు చక్రాల ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.
గతేడాది తన బర్త్డే సందర్భంగా కేటీఆర్.. తన సొంత ఖర్చులతో 6 అంబులెన్స్లను అందించారు. కేటీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి 90 అంబులెన్స్లను అందజేశారు.