Home / MOVIES / ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌

టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌ను తీసుకున్నట్టు చిత్ర బృందం తాజాగా సొషల్ మీడియాలో అధికారక ప్రకటన ఇచ్చింది.

ఇందులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న శర్వాకి జంటగా నటిస్తోంది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ ఎల్ వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ – కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో ఇంతకముందు వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’ వంటి చిత్రాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ క్రమంలో వీరి కాంబోలో నాలుగో చిత్రంగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రాబోతోంది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవగా, హీరోహీరోయిన్స్‌తో పాటు ముఖ్య తారాగణం పాల్గొంటున్న కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat