తెలంగాణ వ్యాప్తంగా ఆహార భద్రత కొత్త కార్డులను సోమవారం నుంచి అర్హులకు అందించనున్నారు. సికింద్రాబాద్లోని సీఆర్ఓ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సోమవారం వీటిని పంపిణీ చేయనున్నారు.
ఆహార భద్రత కార్డుల కోసం దాదాపు 81 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా కాలంగా ఈ దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 20 రోజులుగా ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు.
మొదటి విడతలో 50 వేల కార్డులను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తారు. దశలవారీగా అర్హులందరికీ ఆహార భద్రత కార్డులను పంపిణీ చేస్తామని డీఎస్ఓ రమేష్ తెలిపారు.