Home / SLIDER / యునెస్కో గుర్తింపుపై మంత్రి పువ్వాడ హర్షం

యునెస్కో గుర్తింపుపై మంత్రి పువ్వాడ హర్షం

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్‌కు మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ గారికి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు.

కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా ఆలయాలు నిర్మించారు. కాకతీయ శిల్పకళా నైపుణ్యం దేశంలోనే ప్రత్యేకమైంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి పూర్వ వైభవానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat