ఇటీవల తెలంగాణ రాష్ట్ర గురుకుల సంస్థల కార్యదర్శి పోస్టుకు రాజీనామా చేసిన తాజా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
బీఎస్పీ పార్టీ వేదికగా తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు ఎనిమిదో తారీఖున నల్లగొండ జిల్లాలో ఎన్.జి కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి 5 లక్షల మంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ కో-ఆర్డినేటర్ రాంజీ గౌతం సమక్షంలో ఆర్ఎస్ ఆ పార్టీలో చేరనున్నరు.