జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన ఓర్సు తిరుపతి అనే వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తిరుపతికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 1,50,000 ఎల్వోసీ ని ఆయన భార్య ఉపేంద్రకు మంత్రి అందజేశారు. హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి ఈ ఎల్వోసీని అందజేశారు.