ఇకపై కొత్త సిమ్కార్డు తీసుకోవాలంటే వ్యయప్రయాసలు అవసరం లేదు. ఇంటికే మొబైల్ డెలివరీకి టెలికాం ఆపరేటర్లకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీవోటీ) ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 16న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ డీవోటీ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకా రం ఆయా టెలికాం ఆపరేటర్ల వెబ్సైట్లో ఆధార్ అథెంటికేషన్తో ఈ-కేవైసీని సమర్పించి, సిమ్కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
టెలికాం ఆపరేటర్లు ఇంటికే కొరియర్ ద్వారా సిమ్కార్డును పంపుతారు. వినియోగదారులు తమ పోస్ట్పెయిడ్ సిమ్కార్డును ప్రీపెయిడ్గా.. ప్రీపెయిడ్ ఖాతాను పోస్ట్పెయిడ్గా మార్చుకోవడాన్ని కూడా ఆన్లైన్ చేశారు. వారికి సంబంధిత సిమ్కార్డులు ఇంటికే వస్తాయి.