ప్రపంచానికి సవాల్ విసురుతున్న క్యాన్సర్కు అత్యాధునిక చికిత్స, మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల కొందరి ప్రాణాలైనా కాపాడుతున్నా.. మరణాలు మాత్రం ఆగడం లేదు.
అయితే క్యాన్సర్ రోగుల్లో ధైర్యం నూరిపోసి మానసికోల్లాసం కలిగిస్తే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందంటున్నారు వైద్యనిపుణులు. క్యాన్సర్ రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారిలో మానసిక బలాన్ని నింపేందుకు ఏటా సెప్టెంబరు 22న ఏటా వరల్డ్ రోజ్ డే (క్యాన్సర్ బాధితుల సాంత్వన దినం) నిర్వహిస్తున్నారు.
అపోహలు తొలగించాలి
క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోరని, సరైన సమయంలో గుర్తిస్తే ఆరోగ్యంగా జీవించేందుకు అవకాశం ఉందన్న విషయాన్ని రోగులకు తెలియజేయాలి. క్యాన్సర్తో బాధపడేవారు చాలావరకు ఒంటరిగా ఉంటూ అపోహలు, అనుమానాలతో భయపడుతూ ఉంటారు. వారిలో ధైర్యాన్ని నూరిపోయాలి.
జాగ్రత్తలు తప్పనిసరి
– జంక్ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఫ్యాట్ వల్ల ఆరు రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు ఉంది.
– ధూమపానం, మద్యంపానం వల్ల చాలా రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. పొగ తాగితే లంగ్ క్యాన్సర్, బ్రెయిన సంబంధిత క్యాన్సర్, నోరు, గొంతు, వాయిస్ బాక్స్, కడుపు క్యాన్సర్లు వస్తాయి. ఆల్కహాల్ వల్ల కడుపు, లివర్ క్యాన్సర్లు వస్తాయి.
– నాణ్యత లేని లోషన్లు, లిప్స్టిక్లు వాడితే అందులోని హానికరమైన రసాయనాల వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది.
– మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య సూర్యుడి నుంచి వెలువడే కిరణాల వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. శరీరం ఉండే మెలనిక్ అనే ప్రిగ్మెంట్కు హాని కలగడం వల్ల చర్మక్యాన్సర్ రావచ్చు.
– కొంతమందికి వంశ పారంపర్యంగా కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి. తల్లిదండ్రులకు క్యాన్సర్ ఉంటే ముందస్తుగా పిల్లలకు తరచూ పరీక్షలు చేయించడం మంచిది.
– రోజువారీ కార్యక్రమాల్లో వ్యాయామాన్ని భాగంగా చేసుకోవాలి. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.