Home / MOVIES / రూ. 5 కోట్ల ఖర్చుతో Mahesh House

రూ. 5 కోట్ల ఖర్చుతో Mahesh House

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక దీని తర్వాత మహేశ్ తదుపరి చిత్రం గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘అతడు, ఖలేజా’ తర్వాత క్రియేటివ్ జీనియస్ త్రివిక్రమ్ తో మూడో సినిమాకి సిద్ధమవుతున్నారు మహేశ్ బాబు.

నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా స్ర్కిప్ట్ ను త్రివిక్రమ్ అప్పుడే పూర్తి చేశారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేశ్ –  త్రివిక్రమ్  సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ రూ. 5 కోట్ల ఖర్చుతో హైద్రాబాద్ లో ఓ మాసీ హౌస్ సెట్ ను నిర్మిస్తున్నారట. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు ఈ సెట్ లోనే జరుగనున్నాయట. ఈ సినిమాకే ఈ సెట్ హైలైట్ అని తెలుస్తోంది.

ఇక ఇందులో కూడా పూజా హెగ్డేనే కథానాయికగా ఎంపిక చేశారు త్రివిక్రమ్. లాస్ట్ ఇయర్ త్రివిక్రమ్ ,బన్నీ కాంబో మూవీ అలవైకుంఠపురములో మూవీలో బుట్టబొమ్మగా పూజా అదరగొట్టిన సంగతి తెలిసిందే. అలాగే.. పూజా ఇంతకు ముందు మహేశ్ తో మహర్షి సినిమాలో కథానాయికగా నటించింది. ఏ కోణంలో చూసినా..  మహేశ్, త్రివిక్రమ్ మూవీకి కథానాయికగా పూజా చాలా అసెట్ అని అర్ధమవుతోంది. తమన్ సంగీతం అందిస్తున్నఈ సినిమా కోసం త్రివిక్రమ్ మహేశ్ బాబును ఏరేంజ్ లో ప్రెజెంట్ చేస్తారో చూడాలి. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat