మొదటిగా కోరియోగ్రఫర్గా సినీ కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటుడుగా మారి దర్శకుడిగా సత్తా చాటాడు ప్రభుదేవా. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవ ఈ సినిమాతో మంచి మార్కులు సంపాదించాడు.
ఆ తర్వాత పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకి దర్శకత్వం వహించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన పోకిరి సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేసి భారీ హిట్ కొట్టాడు.
ఇటీవలి కాలంలో ప్రభుదేవా దర్శకుడిగా విఫలం అవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన డైరెక్షన్స్కి గుడ్ చెప్పి నటుడిగా కొనసాగాలని అనుకుంటున్నారట. సోమవారం ప్రభుదేవా సినిమాకి సంబంధించిన చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది.
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ద్వారా శ్యామ్ రోట్రిక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.జాయ్ ఫిలిం బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జాన్ బ్రట్టో నిర్మిస్తున్నాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ఓటైనర్గా వస్తున్న ఈ మూవీలో నటుడు జాన్ విజయ్, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ప్రభుదేవాను ఈ చిత్రంలో ఫుల్ యాక్షన్ హీరోగా చూడబోతున్నారని తెలిపారు.