సౌత్ ఇండస్ట్రీలోటాప్ హీరోయిన్గా చెలామణి అవుతున్న కీర్తి సురేష్.. తన నటన, అందంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. నేను లోకల్ లాంటి కమర్షియల్ మూవీతో పాటు మహానటి లాంటి హిస్టారికల్ మూవీతో నేషనల్ వైడ్గా ఫేమస్ అయిపోయిన కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట, చిరంజీవి భోళా శంకర్ చిత్రాలలో నటిస్తుంది.
కీర్తి సురేశ్ ఓ నాటి అందాల నాయిక మేనక కూతురు. మేనక అప్పట్లో చిరంజీవి ‘పున్నమినాగు’లో నాయికగా నటించారు. కీర్తి సురేశ్ తండ్రి సురేశ్ కుమార్ మళయాళ చిత్ర దర్శకుడు. మేనక, సురేశ్ కుమార్ దంపతులకు 1992 అక్టోబర్ 17న కీర్తి సురేశ్ జన్మించింది. ఈ అమ్మడు ఇప్పటి దాకా ఏడాదికి ఒకటి లేదంటే రెండు సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. రాబోయే సంవత్సరంలో తన హవా చూపించేందుకు రెడీ అవుతోంది.వచ్చే ఏడాది ఏకంగా మూడు పెద్ద సినిమాలతో తెరమీద కనిపించబోతోంది.
ఈ రోజు కీర్తి బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట , భోళా శంకర్ చిత్రాలలో కీర్తి లుక్కి సంబంధించి పోస్టర్ విడుదల చేశారు. ఇవి అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్న విషయం తెలిసిందే.