దేశంలో బీజేపీ పాలనలో ఎక్కడైనా దళిత బంధు ఉందా? అని ఆదివారం ప్రగతిభవన్లో మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మోదీ సర్కారును ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నరు.
ప్రజల మీద భారం మోపుతోందే మీరు. పెట్రోల్, డీజిల్ మీద ఉన్న అన్ని సెస్లను వెంటనే విత్డ్రా చేయండి. వెంటనే పెట్రోల్ ధర దానంతట అదే తగ్గుతుంది. రాజ్యాంగబద్ధంగా సెంట్రల్ ట్యాక్స్లో రాష్ట్రాలకు 41 శాతం స్టేట్ ట్యాక్స్ ఇవ్వాలి.
కానీ.. రూపాయి ఇవ్వలేదు. మీ అడ్డందిడ్డం పనులను మేం చూస్తూ కూర్చోలేం. వ్యక్తిగతంగా నన్ను నిందించినా నేను ఏనాడూ పట్టించుకోలేదు కానీ.. రైతాంగం బతుకులతో చెలగాటం ఆడుతున్నారు కాబట్టి.. మీ మాటలు నమ్మితే రైతులు మునిగిపోతారు కాబట్టి.. నేను ఆవేదనతో మాట్లాడుతున్నా.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.