నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటాలో పన్నెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన జాబితాలో చివరి గంటల్లో ఇద్దరు అభ్యర్థులు మారిపోయారు. నిజామా బాద్ జిల్లా నుంచి తొలుత ఆకులు లలితను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి.
కానీ ఢిల్లీలో మకాం వేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఆకస్మికంగా ఆమె స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సైతం గాయకుడు సాయిచంద్ పేరును ఖరారు చేసినట్లుగా ఆదివారం వార్తలు వచ్చినప్పటికీ మరుసటి రోజు (సోమవారం)కు ఆయన స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కూచికుళ్ల దామోదర్ రెడ్డి పేరు వచ్చి చేరింది.
ఆయనకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఫాం అందజే శారు. వీరిద్దరూ మంగళవారం మధ్యాహ్నం ఆయా జిల్లా కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేయనున్నారు. మిగిలిన పది మంది పేర్లు యథావిధిగా ఉన్నాయి.