జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నాగదేవర సూర్య వంశీ నిర్మాతగా.. దగ్గుబాటి రానా ,నిత్య మీనన్ ,సంయుక్త మీనన్, మురళి శర్మ,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించగా శుక్రవారం విడుదలైన చిత్రం భీమ్లానాయక్.
భీమ్లానాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద రప్ఫాడిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు Overseasలోనూ దుమ్ము రేపుతోంది. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.13.51కోట్లు, ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలుపుకుంటే మొత్తం రూ. 16.73కోట్ల షేర్ సాధించింది. తొలి మూడు రోజుల్లో తెలంగాణలో రూ.25.88కోట్లు షేర్ వసూలు చేసింది. ఏపీలో రెండు రోజుల్లోనే రూ.27.19కోట్ల షేర్ వచ్చింది.