హిందీ భాష పై అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ట్విటర్లో కౌంటర్ ఇచ్చారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత దేశం బలం.. అందుకే భారతదేశం వసుదైక కుటుంబం అయింది. ఏం తినాలో ఏం వేసుకోవాలో ఎవర్ని పూజించాలో ఏ భాష మాట్లాడాలో అనేది ప్రజలను నిర్ణయించుకొనివ్వండి.
భాష ఆధిపత్యం ఎప్పటికీ చెల్లదు. నేను ముందు భారతీయుడిని , తర్వాతే తెలంగాణ బిడ్డను. నా మాతృ భాష తెలుగు, నేను ఇంగ్లీష్ హిందీ, కొంచం ఉర్దూ లో కూడా మాట్లాడగలను. దేశ పౌరుల మీద హిందీ భాషను రుద్ది ఆంగ్లభాషను దూరం చేస్తే వారికి అన్యాయం చేసినవారు అవుతారు.’’ అంటూ కేటీఆర్ అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు.
అంతకుముందు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకొనేప్పుడు ఇంగ్లీష్, స్థానిక భాషల్లో కాకుండా హిందీలోనే తప్పక మాట్లాడాలని అమిత్ షా పిలుపునివ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇది ‘భారతదేశ భిన్నత్వంపై దాడి’గా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.