ఐపీఎల్ క్రికెట్ లో 150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేసర్ గా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ స్టార్ ప్రధాన ఆటగాడు భువనేశ్వర్ రికార్డులకెక్కాడు.ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విధితమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ మొత్తం ఇరవై ఓవర్లలో నూట యాబై ఒక్క పరుగులకు ఆలౌటైంది.పంజాబ్ బ్యాటర్స్ లో లివింగ్ స్టోన్ ముప్పై మూడు బంతుల్లో అరవై పరుగుల(5*4,4*6)తో రాణించగా షారూక్ ఖాన్ ఇరవై ఆరు పరుగులతో పర్వాలేదన్పించాడు.
హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ నాలుగు వికెట్లను పడగొట్టగా భువనేశ్వర్ మూడు వికెట్లను దక్కించుకున్నాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన హైదరాబాద్ 18.5ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 152పరుగులను చేధించింది. అయితే హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ ఖాన్ తన లాస్ట్ ఓవర్ లో రనౌట్ తో సహా నాలుగు వికెట్లను వరుసగా పడగొట్టి పంజాబ్ ను చావుదెబ్బ కొట్టాడు.
ఈమ్యాచ్లో 3 వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు. ఇటీవల స్పిన్నర్ యుజ్వేంద చాహల్ 150 వికెట్ల క్లబ్బులో చేరాడు. అంతకుముందు స్పిన్నర్లు అమిత్ మిశ్రా(166), పీయూష్ చావ్లా (157) ఈ ఘనత సాధించారు. ఓవరాల్గా డ్వేన్ బ్రావో(177), లసిత్ మలింగ(170) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.